ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దేశీయంగా లోహ, రియాల్టీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగ షేర్లు ఒక శాతం నుంచి రెండు శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.