సుల్తాన్బజార్, డిసెంబర్ 23 : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక కారుణ్య నియామకం అయినందున టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ నేతృత్వంలో గురువారం నాంపల్లిలోని జిల్లా శాఖ కార్యాలయంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముజీబ్ మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ విధానంతో ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్క ఉద్యోగికి టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎటువంటి పథకం ప్రవేశపెట్టినా ఉద్యోగులు ముందుండి విజయవంతం చేస్తారన్నారు. కారుణ్య నియామకాలు చేపడుతున్నందున సీఎం కేసీఆర్కు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రంకుమార్, ఉపాధ్యక్షుడు ఓమర్ ఖాన్, సభ్యులు వైదిక్ శస్త్ర, శంకర్, స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ సభ్యులు ఫిర్దోస్, ముజాహిద్, జీవన్, సోహెల్, ఫయాజ్ అలీ, సూర్య ప్రకాశ్, రాఖేశ్, మీర్జా బేగ్ తదితరులు పాల్గొన్నారు.