తిరుమల : ఆపద మొక్కులవాడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan ) కల్పించారు.
నిన్న 67,202 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 25,864 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.04 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.