తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య తిరుమాడ వీధుల్లో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుత్మంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.