తిరుమల : వారంతపు ఆదివారం సెలవు దినం కారణంగా తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(Devotees crowd)పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 21 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు(Tokens) లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd officials) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 75,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 36,272 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చిందని తెలిపారు. కాగా తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం నుంచి పునః ప్రారంభించింది. కొవిడ్ నేపథ్యంలో మూడు సంవత్సరాలుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది.
అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద 5 వేల దివ్యదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుందని స్పష్టం చేసింది.