న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఓ ఉగ్రవాది అని, దాదాపు 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణమని బీజేపీ నేత, మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ ఆరోపించారు. టికాయిత్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు వల్ల ఖలిస్థాన్ గూండాలకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. కాగా, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రైతులు మరణించినట్టు తమకు తెలియదని ఇటీవల కేంద్రమంత్రి తోమర్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆ పార్టీ నేతనే దాదాపు 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించడం గమనార్హం.