మంథని : పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. మంథని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో సచరిస్తున్నది. దీంతో అటవీ గ్రామాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతం నుంచి మంథని మండలంలోని అడవి సోమన్పల్లి గ్రామ పరిధిలోనీ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లుగా తెలుస్తున్నది. దీంతో అధికారులు అడవి సోమన్పల్లి, వెంకటాపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయిపేట గ్రామస్తులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పొలాల వద్ద ఎలాంటి కరెంట్ తీగలతో ఉచ్చు పెట్టొద్దని సూచించారు.