ములుగు : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. మంగపేట మండల పరిధిలో పాకాల కొత్తగూడ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగపేట అటవీ రేంజ్ పరిధిలో అడవులను ఆనుకొని ఉన్న గూడాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఎవరు కూడా ఒంటరిగా ప్రయాణం చేయొద్దన్నారు. రాత్రిపూట అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.