హైదరాబాద్ : ఉమామహేశ్(33) అనే యువకుడు పదేళ్లక్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. దీంతో నడుం కింది భాగంలో స్పర్శ, కదలికలు కోల్పోయాడు. వీల్చైర్కే పరిమితమయ్యాడు.
తనున్న స్థితిని, తన బాధను వ్యక్తం చేస్తూ సాయం చేయాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎక్కడికి ఒంటిరిగా వెళ్లలేకపోతున్నట్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ త్రీ వీలర్ స్కూటీ ఇప్పించాల్సిందిగా కోరాడు.
దీనిపై స్పందించిన కవిత వెంటనే బాధితుడికి త్రీ వీలర్ స్కూటీని ఇప్పంచి అందజేశారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఉమామహేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదం వలన 10 సంవత్సరాల నుండి వీల్ చైర్కే పరిమితమయ్యా. తాను ఒక్క ట్వీట్ చేయగానే స్పందించి కవితక్క స్కూటీ ఇచ్చింది. అంతేకాకుండా జీవితంలో అన్ని రకాలుగా అండగా ఉంటానని కొండంత బరోసా ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపిన కవితక్కకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు.