న్యూఢిల్లీ: స్పానిష్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీ-2లో టోక్యో ఒలింపిక్ చాంపియన్ ప్రమోద్ భగత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుని తిరుగులేదని నిరూపించాడు. మరో భారత పారా షట్లర్ సుకాంత్ కదం స్వర్ణంతోపాటు రజతం కొల్లగొట్టాడు. స్పెయిన్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ప్రమోద్ 17-21, 21-17, 21-17తో కుమార్ నితేశ్ను చిత్తు చేయగా.. మిక్స్డ్ డబుల్స్లో ప్రమోద్-మనోజ్ సర్కార్ ద్వయం 21-19, 11-21, 21-11తో భారత జోడీ సుకాంత్-నితేశ్ జంటను ఓడించింది. ప్రమోద్ జోడీకి స్వర్ణం.. సుకాంత్ ద్వయానికి రజతం దక్కాయి. మిక్స్డ్ డబుల్స్లో పాలక్ కోహ్లీ-ప్రమోద్ జోడీ 14-21, 21-11, 21-14తో మానసి- రుతిక్ రఘుపతి జంటపై ఉత్కంఠ విజయం సాధించింది.