అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని మైలవరం మండలం కర్మలవారి పల్లె సమీపంలోని తాడిపత్రి బైపాస్ రోడ్డులో లారీ ఆగి ఉండగా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు చౌడం లక్ష్మీ మునమ్మ, వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో మరొకరిని వెంకటసుబ్బయ్య మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ఓ బాలిక గాయపడింది. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.