కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తయింది. దీన్ని పురస్కరించుకుని పంజాబ్, హర్యానా, యూపీతో పాటు పలు ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని దీక్షా శిబిరాలకు చేరుకున్నారు. ఉద్యమంలో అమరులైన రైతులకు ఘనంగా నివాళులర్పించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీతో పాటు దాదాపు అన్ని రాష్ర్టాల్లో ర్యాలీలు జరిగాయి. ఎంఎస్పీ, ఇతర డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొన్నది.