నీలగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో కలిసి సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిస్వార్థంగా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న నాయకులకు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించే నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డివిజన్లో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నందున పార్టీల అభ్యర్థులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాటికి తిప్పుకొట్టాలని కోరారు. ఆయన వెంట కాలనీవాసులు లింగయ్య, పెద్ద లింగయ్య, రహీం, షకిల్, రియాజ్, యాదయ్య పాల్గొన్నారు.