భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన దేవి అహిల్య విశ్వవిద్యాలయ్ (డీఏవీవీ) విద్యార్ధి సాహిల్ అలీ బంపర్ ఆఫర్ (Job Offer) చేజిక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ టెక్నాలజీ కంపెనీ అద్యెన్ నుంచి రూ. 1.13 కోట్ల వార్షిక వేతన ప్యాకేజ్తో జాబ్ ఆఫర్ను సొంతం చేసుకుని కాలేజ్లో అత్యధిక వేతన ప్యాకేజ్ రికార్డును తిరగరాశాడు.
ఐఐటీ, ఐఐఎం ప్లేస్మెంట్స్ ట్రెండ్కు భిన్నంగా డీఏవీవీ ఐఐపీఎస్ కాలేజ్లో ఎంటెక్ డిగ్రీ పూర్తి చేసి అరుదైన ఆఫర్ను దక్కించుకున్నాడు. అద్యెన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాహిల్ అలీ చేరాడు. ఇంతటి అత్యధిక వేతన ఆఫర్ను సొంతం చేసుకున్న డీఏవీవీ తొలి విద్యార్ధిగా సాహిల్ అలి అరుదైన ఘనత సాధించాడు.
అద్భుతమైన వేతన ప్యాకేజ్లతో కూడిన ప్రతిష్టాత్మక జాబ్ ఆఫర్లు ఐఐటీ, ఐఐఎం, టాప్ బిజినెస్ స్కూల్స్ వంటి అత్యున్నత విద్యాసంస్ధల విద్యార్ధులకే లభిస్తాయనే అపోహను సాహిల్ తుడిచిపెట్టాడు. డీఏవీవీలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్లో సాహిల్ అలీ ప్రస్ధానం ప్రారంభమై ప్రతిష్టాత్మక జాబ్ ఆఫర్ను సొంతం చేసుకునే దిశగా సాగింది.
Read More :