కొలంబో: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం ఎదుర్కొన్న శ్రీలంక త్వరలో భారత్లో పర్యటించనుంది. ఈనెల 24తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) సోమవారం తమ జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ దసున్ శనక సారథ్యంలో 18 మందితో కూడిన లంక బృందం భారత పర్యటనకు రానుంది. ఈనెల 24న తొలి టీ20 లక్నోలో, 26, 27న ధర్మశాలలో మిగతా రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్తో యువ స్పిన్నర్ డేనియల్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఆసీస్ గడ్డపై 1-4తో టీ20 సిరీస్ను చేజార్చుకున్న లంక భారత్తో సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. ఓటమి నుంచి తేరుకుని సత్తా చాటాలని తహతహలాడుతున్నది.
దసున్ శనక (కెప్టెన్), నిస్సాంక, మెండిస్, అసలంక, దినేష్, గుణతిలక, మిషారా, జనిత్, హసరంగ, కరుణరత్నె, చమీరా, లహిరు కుమార, అవిష్క ఫెర్నాండో, మహీష్, జెఫ్రె, ప్రవీణ్, అషియన్ డేనియల్.