తిరువనంతపురం: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ను గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న అతన్ని మాన్జెర్రీ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్పించారు. 13వ తేదీన హాస్పిటల్లో చేరిన ఆ వ్యక్తిలో 15వ తేదీ నుంచి మంకీపాక్స్ లక్షణాలు కనిపించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ వ్యక్తితో సన్నితంగా ఉన్నవారిని, కుటుంబసభ్యుల్ని అబ్జర్వేషన్లో పెట్టినట్లు మంత్రి చెప్పారు.