చేవెళ్ల టౌన్, డిసెంబర్ 14 : దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న దొంగలను ఎస్వోటీ పోలీసులు పట్టుకొని చేవెళ్ల పోలీసులకు అప్పగించారు. అకడి నుంచి ఒక దొంగ చేవెళ్ల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుక పోయిన సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం,(ఎస్వోటీ) షాబాద్, చేవెళ్ల పోలీసులు కలిసి ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి మొత్తం 22 తులాల బంగారం, రెండు కేజీల సిల్వర్, మూడు మోటార్ సైకిళ్లు, రూ.90 వేల నగదు, మొత్తం 15 లక్షలు పట్టుకుని ఎస్వోటీ పోలీసులు చేవెళ్ల పోలీసులకు అప్పగించారు.
కాలకృత్యాల కోసం హసన్ బిన్ అలీని బాత్రూంకు తీసుకెళ్లగా అతను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయాడు. చేవెళ్ల మండల పరిధిలోని కేసారం గ్రామంలోని పొలాల్లో దాక్కున్నాడు. పోలీసులు అతడిని గంట వ్యవధిలో పట్టుకున్నారు. నిందితుడిపై 20కి పైగా దొంగతనం కేసులు, బంజారాహిల్స్లో రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.