న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఐపీవో తర్వాత కూడా ఎల్ఐసీ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉంటుందన్న ఆందోళన ఇన్వెస్టర్లకు అక్కర్లేదని, నిర్ణయాల్ని డైరెక్టర్ల బోర్డే తీసుకుంటుందని, ప్రభుత్వం కాదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఆర్ కుమార్ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం మెగా ఐపీవో ప్రక్రియ చురుగ్గా అమలు జరుగుతున్న నేపథ్యంలో కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన తర్వాత ఎల్ఐసీ 3.0 వెర్షన్ను చూస్తారని, పాలసీదారులకు, షేర్హోల్డర్లకు అద్భుతమైన ఫలితాల్ని అందిస్తుందన్నారు. మార్చిలో లిస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.