హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దేశమంతటా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో పంజాబ్, హర్యానా రాష్ర్టాల విధానాన్ని తెలంగాణకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని దామోదర్ తెలిపారు.