హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు 80 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు హర్షం ప్రకటించారు. సినీ పరిశ్రమలో పెండింగ్ సమస్యలను పరిష్కరించినందుకు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బీఆర్కేభవన్లో సీఎస్ను కలిసి తమ సంతోషాన్ని తెలియజేశారు. సీఎస్ను కలిసినవారిలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగోవింద్రాజ్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ వాణిజ్య, ఎగ్జిబిటర్ సదానంద్గౌడ్ ఉన్నారు.