పెంట్లవెల్లి, జనవరి 19 : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వడ్డెర కులసంఘం భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధుల ద్వారా రూ.10లక్షలతో నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నూతనంగా ఏర్పడిన పెంట్లవెల్లి మండల కేంద్రాన్ని తనవంతుగా అభివృద్ధి చేసేందుకు విడుతల వారీగా కృషి చేస్తానన్నారు. మండల కేంద్రంలోని చౌటచెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు రూ.5కోట్లు మంజూరు చేయించి తక్కువ సమయంలోనే పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే బీరం వివరించారు. అంతేకాక మండల కేంద్రం సమీపంలో పెంట్లవెల్లి-మల్లేశ్వరం గ్రామల సమీపంలో ప్రవహిస్తున్న వాగుపై హైలేవల్బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్ నిధుల ద్వారా రూ.6 కోట్లను మంజూరు చేయించి తక్కువ కాలంలోనే బ్రిడ్జీ నిర్మాణం
పూర్తి చేయించామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉమామహేశ్వరిరాజేశ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మతీన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకుడు రాజేశ్, సింగిల్విండో చైర్మన్ విజయరామారావు, వివిధ గ్రామాల సర్పంచులు సువర్ణమ్మ, ఎస్కే ఖాజా, నాగరాజు, ఎంపీటీసీలు సుమలత, వెంకటేశ్వర్లు, ఆర్డీవో హనుమానాయక్, తాసిల్దార్ దామోదర్, నాయకులు శేషేంద్రప్రసాద్, రమణయాదవ్, హన్మంత్, వడ్డెర సంఘం మండలాధ్యక్షుడు ఆంజనేయు లు, నర్సింహ, మద్దిలేట్టి, కుమార్, మధు పాల్గొన్నారు.