సన్నాహక సమావేశాల్లో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్య యాదవ్ తెలంగాణలో పండిన వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై తిరుగుబావుటా మొదలైంది. రాష్ట్రంపై మోదీ సర్కార్ అవలంబిస్తున్న ధోరణిని ప్రజలకు ఎండట్టేందుకు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం నాగర్కర్నూల్, జడ్చర్ల, భూత్పూరు, చిన్నంబావిలో జరిగిన సమావేశాలకు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్య యాదవ్ హాజరై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
నాగర్కర్నూల్, మార్చి 24 : రాష్ట్రంలో పం డిన వరిని కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచుతాం.. హక్కులు సాధించుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుకు రాజ్యాంగ రక్షణ కల్పించే విధంగా కేంద్రం చట్టం తెచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. గురువారం జిల్లా కేం ద్రంలోని లహరి గార్డెన్స్లో నాగర్కర్నూల్ ని యోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే మర్రి అధ్యక్షతన నిర్వహించగా.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే పం జాబ్ తర్వాత వరి పండించే రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. అలాంటి రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ధా న్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి ది క్కుతోచని విధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం తగదన్నారు. పంజాబ్ రాష్ట్రం లో ధాన్యాన్ని కొంటూ తెలంగాణలో ధాన్యాన్ని ఎందు కు కొనరని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ప్రభు త్వ వైఖరి ఏమిటో తెలియజేయాలన్నారు. జీఎస్టీ ద్వా రా రాష్ర్టానికి రావాల్సిన డబ్బులు, నిధుల విడుదల, పథకాల అమలు తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు. విభజన చట్టాలను అమలు చేయకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. మోడీ పాలనలో తెలంగాణాకు ఒక్క కేంద్రీయ విశ్వ విద్యాలయం, గిరిజన యూనివర్సిటీ మంజూరు కాలేదని ఆరోపించారు. కేంద్రం ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు. రైతు సంక్షేమంతోపాటు రాష్ట్ర ప్రజల హక్కులకోసం విభజన చట్టం డిమాండ్లను అమలు చేసేవరకూ కేం ద్రంపై పోరాటానికి సన్న ద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చే స్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి వివరించాల్సిన బా ధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ తెలంగాణ హక్కులకో సం కేంద్రంపై పోరాటాలకు ప్రతి కార్యకర్త ముందుండాలన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మా ట్లాడుతూ తెలంగాణపై వివక్షతను పాటిస్తున్న కేంద్రంపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నేత శ్రీనివాస్యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, మార్కెట్ కమి టీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.