ముగ్గురు భిన్న నేపథ్యాలున్న వ్యక్తులు..వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న సంఘటనలు…వారి బ్రతుకు పోరాటం ఏ దరికి చేరిందో తెలుసుకోవాలంటే ‘గమనం’ చూడాల్సిందే అంటున్నది సుజనా రావు. ఆమె దర్శకత్వంలో శ్రియ, శివకందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకులముందుకురానుంది. ‘ఈ సినిమాలోని ప్రతి కథ హృదయాన్ని హత్తుకుంటుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, ఇళయరాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వీఎస్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుజనారావు.