సుల్తాన్బజార్,జనవరి 4: ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో అధికారులు, ఉద్యోగుల కృషి ఎనలేనిదని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా శాఖ 2022 డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీలతో డైరీ, క్యాలెండర్లను కలిసి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు ఉమాదేవి, నజీర్ అహ్మద్, కార్యనిర్వాహణ కార్యదర్శి కొండల్రెడ్డి, తెలంగాణ నాల్గవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఖాదర్బిన్ హసన్, హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్కుమార్, ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, వైదిక్ శస్త్ర, ముఖీం ఖురేషి, ఖాలేద్ అహ్మద్, శంకర్, జానకి, సుజాత, గీత, బుసిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ కార్యదర్శులు ప్రభాకర్, దేవేందర్, పీఆర్వో జహంగీర్, ముజీబ్ పాల్గొన్నారు.