హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణం ప్రపంచ పర్యాటకక్షేత్రంగా విరాజిల్లుతుందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రులు ఆదివారం చినజీయర్స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. వచ్చే నెలలో తలపెట్టిన విగ్రహావిష్కరణ కోసం నిర్మిస్తున్న రోడ్ల పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడి దేవాలయాన్ని, రామానుజ భారీ విగ్రహాన్ని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న రామానుజ విగ్రహం మహిమాన్వితమైనదిగా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక హబ్గా మారిన తెలంగాణకు రామానుజుల విగ్రహం మకుటాయమానంగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారం, సమన్వయంతో ఆవిష్కరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతాయని, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు. ఆశ్రమంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో చినజీయర్స్వామి, మైంహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు పాల్గొన్నారు.