ఢిల్లీ,జూలై:భారతదేశం తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న క్రీడాకారుల తో జులై 13 న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.”నేను 130కోట్లమంది భారతీయుల పక్షాన జులై 13న ఒలింపిక్ క్రీడలకు వెళ్లే క్రీడాకారులతో మాట్లాడతాను. అలాగే వారికి శుభాకాంక్షలను కూడా తెలియజేస్తాను.రండి మనం అందరం కలసి #Cheer4India అని పలుకుదాం.’’అంటూ ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.