హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్లో కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజ భాను చంద్ర ప్రకాశ్ (కరీంనగర్), ఉపాధ్యక్షులుగా రాజ్ గంగారెడ్డి (నిజామాబాద్), తుకారాం (మెదక్) ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరోనాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రద్ధతో పనిచేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యాప్రమాణాలు పెంచడానికి కృషిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల రాష్ట్ర కౌన్సిలర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా సర్దార్నాయక్, రాధాకృష్ణ వ్యవహరించారు.