సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): అత్యధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కిన మహానగరం.. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో కొంత చల్లబడింది. కుత్బుల్లాపూర్, అదర్శ్నగర్లో అత్యధికంగా 4.48 సెం.మీలు, కూకట్పల్లిలో 3.68సెం.మీలు, అల్వాల్లో 2.36 సెం.మీలు తదితర చోట్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
చింతల్లోని పద్మనగర్లో గాలి వాన ధాటికి భారీ చెట్టు కూలగా, రెండు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. పేట్బషీరాబాద్, సుభాష్నగర్, సాయిబాబానగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.