హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించే నీట్ యూజీ- 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సోమవారం ఖరారుచేసింది. ఆలిండియా కోటాలో మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఈ నెల 11వ తేదీ నుంచి మొదలుకానున్నది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.