జనగామ : ఆలయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బీటు బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాగా, ఇదే సందర్భంలో ఆలయంలో దర్శనం చేసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దేవాదాయ భూమికి సంబంధించిన పత్రాలను తెప్పించుకొని పరిశీలించారు. భూమికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి గొడవ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని దవాఖానకు తరలించారు.