జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తొలి సినిమాకు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్నారు. శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం చిత్ర టైటిల్తో పాటు హీరో ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ..‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. నితిన్ అరంగేట్రానికి సరైన కథా కథనాలు ఎంచుకున్నాం. కొత్త హీరో అయినా నటనతో మెప్పిస్తాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. నరేష్ వీకే, రావు రమేష్, సుదర్శన్, భద్రం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ధాము నర్రావుల, సంగీతం : కైలాస్ మీనన్, ఎడిటర్ మధు, ఆర్ట్ : రామాంజనేయులు.