హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు కృషి, ఆలోచనా విధానంపై టీఆర్ఎస్వీ నాయకుడు రాజేశ్నాయక్ రాసిన ‘నిత్య కృషీవలుడు’ పుస్తకాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వవిప్ బాల సుమన్ ఆవిష్కరించారు. మంగళవారం మంత్రుల నివాసంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కృషినీ, రాష్ట్రసాధన ఉద్యమంలో పోషించిన పాత్రను రచయిత అద్భుతంగా వివరించారని అభినందించారు.