హయత్నగర్, నవంబర్ 25 : హయత్నగర్ డివిజన్ పరిధి ఇన్ఫర్మేషన్ కాలనీలోని రాచకాలువపై గురువారం తెల్లవారుజామున కొంతమంది ఆక్రమణదారులు, ట్రాన్స్జెండర్లతో కలిసి ఐదు గుడిసెలను వేసుకున్నారు. విషయం తెలుసుకున్న హయత్నగర్ మండల తాసీల్దార్ సుశీల, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ అధికారులతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తాసీల్దార్ ఫిర్యాదు మేరకు హయత్నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ ఆదేశాల మేరకు అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే రెవెన్యూ సిబ్బంది గుడిసెలను తొలగించేందుకు యత్నించగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగి అడ్డుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ నరేందర్రెడ్డి, కిరణ్రెడ్డి, ఏఎస్ఐలు రాజేశ్, నర్సిరెడ్డి, తాహెరాబేగం, తదితరులు పాల్గొన్నారు.
రూ.8 కోట్ల విలువైన స్థలం కబ్జా.?
సర్వే నం.199, 213, 207 మధ్య 33 ఫీట్ల వెడల్పుతో ఉన్న రాచకాలువ సాహెబ్నగర్, సుక్కోనికుంట నుంచి మొదలైన రైస్మిల్లును ఆనుకొని దేశ్ముఖ్ రెవెన్యూ, హయత్నగర్ మండల రెవెన్యూ సర్వే నం.255 మీదుగా బాగ్ హయత్నగర్లోకి ప్రవహిస్తుంది. దాదాపు రూ.8 కోట్ల విలువైన 2వేల గజాల ప్రభుత్వ స్థలం (నాలా) కబ్జాకు గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కేవైసీ నమోదు చేసుకోండి: సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) : సన్పరివార్ బాధితులు కేవైసీలను నమోదు చేసుకోకుంటే వెంటనే వాట్సాప్ నంబర్-7901099438, 7901125032, 7901125120 లేదా మెయిల్-eowcyb @gmail.com లేదా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ఎకనామిక్ ఆఫెన్సస్ వింగ్ విభాగాన్ని సంప్రదించాలని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కోరారు. గురువారం సన్పరివార్ బాధితుల కమిటీతో ఆయన భేటీ అయ్యారు. నవంబర్ 30 తర్వాత క్లెయిమ్ కోసం ఎవరు వచ్చినా అంగీకరించమని స్పష్టం చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం
జంగం శ్రీనివాస్ అనే వ్యక్తి రాచకాలువను కబ్జాచేసేందుకు గుడిసెలు వేయించారు. దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశాం. స్థానికంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు హయత్నగర్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు చేపడుతాం.