న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అసెస్మెంట్ సంవత్సరం 2026-27కిగాను 7.8 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజగా వెల్లడించింది. కిందటేడాది రిటర్నులు దాఖలు చేసిన 7.3 కోట్ల మంది కంటే ఇది అధికం.
అలాగే రికార్డు స్థాయిలో దాఖలు చేయడం కూడా ఇదే తొలిసారని పేర్కొంది. వీరిలో ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసిన వారు 5.9 కోట్ల మంది ఉన్నారు.