షెన్జెన్ (చైనా): భారత యువ షట్లర్ ఉన్నతి హుడా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మంగళవారం నుంచి మొదలైన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ బరిలో నిలిచిన ఉన్నతి.. 10-21, 18-21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది.
పురుషుల డబుల్స్లో హరిహరన్-అర్జున్ జోడీ.. చెన్ బొ యాంగ్- లియు యి (చైనా) ద్వయంతో తలపడుతూ తొలి గేమ్ (8-11)లో వెనుకబడి ఉండగా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.