కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. జూన్ 3న విడుదలకానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా..పోలీస్ అధికారి పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరో కొత్త ఆకర్షణ తోడైంది. తమిళ అగ్రహీరో సూర్య ఈ చిత్రంలో కీలకమైన అతిథి పాత్రలో నటించబోతున్నారు. కథాగమనాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో సూర్య కనిపిస్తారని…ఆయన క్యారెక్టర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. స్వీయ నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.