పాలెంలో వ్యవసాయ కళాశాలబాలుర వసతి గృహం ప్రారంభం
బిజినేపల్లి: భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదేనని, దేశంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని పాలెం గ్రామంలో గల వ్యవసాయ కళాశాలలో ఏడున్నర కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఆహార క్షీణత నుంచి బయట పడడం జరిగిందని కేవలం వరి, గోధుమలే కాకుండా పప్పు ధాన్యాలు, ఆయిల్ విత్తనాలు, కూరగాయలు, పండ్లు వంటి ఆహౠర పదార్థాలు నాణ్య మైనవి పండించే విధంగా రైతులను ప్రోత్స హించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు.
పండించిన పంటలను దేశంలో అవసరమైన చోటికి చేర వేసే విధంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకు తగిన స్టోరేజీలు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రపం చంలోని అత్యధిక వ్యవసాయ పొలాలు కలిగిన దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందని, మనకంటే ముందు అమెరికా మాత్రమే ఉందన్నారు. భవిష్యత్తులో యావత్తు ప్రపంచానికి దేశమే ఆహారాన్ని అందించే పరిస్థితికి చేరబోతుందన్నారు. జిల్లాకో వ్యవసాయ కళాశాల ఉండాల్సిందేనని ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మాత్రమే ఉన్నాయన్నారు.
2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంఖుస్థాపన సమయంలో ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయా ల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టు పూర్త య్యే సరికి లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని, అప్పటికప్పుడు వ్యవసా య విద్యార్థులను, ఇంజినీర్లను ఉత్పత్తి చేయలేం కాబట్టి ఇప్పుడే వ్యవసాయ కళా శాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఆనాడు 107కోట్ల రూపాయలు వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరు కోట్ల బాలికల, ఏడున్నర కోట్లతో బాలుర వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ ఒకటో బ్యాచ్ పట్టా లు పొంది కళాశాల నుంచి వెళ్లిపోయారని, రెండో బ్యాచ్ నడుస్తుందన్నారు. 29కోట్ల వ్యయంతో కళాశాల నిర్మాణ పనులు జరు గుతున్నాయన్నారు.
దేశంలో అత్యధిక ఉపాధిని, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం వ్యవసాయ రంగం మాత్రమే అన్నారు. అయితే భూమికి రైతుకు ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధమే వ్యవసాయ అధికారులకు, రైతులకు ఉండాలని, అప్పుడే రైతులు, అధికారులు మంచి అభివృద్ది సాధిస్తారన్నారు. అనంతరం విద్యార్థులను జీకే ప్రశ్నలు అడిగి నగదు బహుమతిని అందజేశారు.
అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ వ్యవసాయ రంగం ప్రధాన జీవనాధారమని, ఇంత ముఖ్యమైన రంగంలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యవంతులుగా ఉండి విజయాలు సాధించాలన్నారు. వ్యవసాయ మంత్రి వ్యవసాయ విద్యనభ్యసించనప్పటికీ స్వయంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో ఎంతో ప్రావీణ్యం సాధిస్తున్నార న్నారు. మంత్రికి గౌరవ డాక్టరేట్ సత్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపకులపతిని కోరారు.
అదేవిధంగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మహార్దశ వచ్చిందని, ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి ప్రధాన పాత్ర ఉందని కొనియాడారు. వ్యవసాయ రం గం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా అధికారులు, విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. దేశ విదేశా ల్లో బాగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. పాలెం వ్యవసాయ కళాశాలలో కొత్త వంగడాల అభివృద్ధి చేసేందుకు వంద ఎకరాల భూమిని కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
వ్యవసాయ కళాశాల ఉపకులపతి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…
2015లో 60మందితో ఒక సెక్షన్గా మారి ప్రారంభించిన ఈ కళాశాల 120మందితో నడిపించేందుకు మౌలిక సదుపా యాలు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 120మంది చొప్పున ప్రవేశాలు ఉంటాయ ని వచ్చే సంవత్సరం పోస్ట్గ్రాడ్యుయేట్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు ఉంటాయన్నారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, రిజిస్ట్రార్ సుధీర్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, సీమా, సత్యనారాయణ, ఏడీఆర్ దామోదరరాజు, పీఏసీఎస్ డైరెక్టర్ జక్కారఘునందన్రెడ్డి, మార్కెట్ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, పాలెం సర్పంచ్ లావణ్య, వెంకటాపూర్ సర్పంచ్ మాధవి రెడ్డి, సైంటిస్టులు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.