సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నగర సుందరీకరణలో భాగంగా ఫ్లైఓవర్లు పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. వినూత్న పద్ధతిన వర్టికల్ గార్డెన్లు చేపడుతూ చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఖైరతాబాద్ జంక్షన్, మూసీ బ్రిడ్జి, నాగోలు,కూకట్పల్లి దగ్గర మొత్తం 10 ఫ్లైఓవర్లకు సంబంధించి 44 పిల్లర్లను సుందరంగా తీర్చిదిద్దారు. నల్గొండ క్రాస్రోడ్, టౌలిచౌకి, లంగర్హౌస్, జేఎన్టీయూ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రోడ్డు నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దిగువభాగంలో పూల మొకలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా ఈనెల నుంచి ప్రతి శుక్రవారం గ్రీన్డే పాటించేందుకు మేయర్ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.