మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్, నవంబర్ 24 : కేం ద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కాలం వెల్లదీయకూడదని, రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని ప్రెస్మీట్లో సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవనంలో, జడ్చర్లలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమం త్రి కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రై తులకు ఎంత చేయాలో అంత చేస్తున్నదన్నారు. దే శంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి 750 మందికిపైగా రైతులు మృతి చెందారని, వారందరికీ సీఎం కేసీఆర్ రూ.3 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. రైతు ల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకా లు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయతోపాటు అనే సం క్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్ర ప్ర భుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవస రం ఉన్నదని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. నూతన సాగుచట్టాలు కార్పొరే ట్ శక్తుల కోసం పనిచేసేలా ఉన్నాయని, ఇవి అమలైతే భవిష్యత్లో రైతులు, వ్యవసాయం కనిపించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులను కేం ద్రం వెనక్కి తీసుకురావడం సంతోషకరమన్నారు. ప్ర ధాని మోడీ వెంటనే పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. వారికి మంచి చేయాలనే తపన ఉం టే రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలను తీసుకురావద్దని సూచించారు. అన్నదాతలు పండించిన ధా న్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రధానంగా స్వామినాథన్ కమిటీ సిఫారసు లు అమలు చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంద ని చెప్పారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నదని, దేశ వ్యాప్తంగా కేంద్రం వ్యవసాయానికి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవస రం ఉన్నదన్నారు. రైతుల ఉద్యమ చరిత్ర అంశం ఆధారంగా నిర్మించిన రైతన్న సినిమా 27వ తేదీన విడుదల కాబోతుందన్నారు. రైతన్నలతోపాటు అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారో.. కనీస మద్దతు ధర ఎందుకు అమలు చే యాలంటున్నారో.. వారి బతుకులకు అద్దంపట్టేలా ఈ సినిమా చిత్రీకరించినట్లు తెలిపారు. అనంతరం నారాయణమూర్తిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదు ల్లా కొత్వాల్, నేతలు సంజీవ్ ముదిరాజ్, బెనహర్, రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ సన్మానించారు. సమావేశాల్లో సీపీఎం నేతలు కిల్లె గోపాల్, కురుమయ్య, రా ములు, చంద్రకాంత్, సత్తయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయాదవ్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ నాయక్, బీసీ సంఘం నాయకులు మండ్ల స్వామి, రామస్వామి, నాగసాయి లు, బుచ్చయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.