యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.