న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత వేధిస్తూనే ఉన్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ.. విదేశాల నుంచి సెమికండక్టర్ల సరఫరా లేని కారణంగా ఆ స్థాయిలో వాహనాల తయారీ జరుగక అమ్మకాలు పడిపోతున్నాయి. గత నెల అక్టోబర్లో మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్సహా మెజార్టీ కంపెనీల ఆటో సేల్స్.. గతేడాది అక్టోబర్తో పోల్చితే క్షీణించాయి. ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర వాహన తయారీ సంస్థలన్నింటి పరిస్థితీ ఇలాగే కనిపిస్తున్నది. పండుగ సీజన్లో బుకింగ్స్ జోరుగానే సాగుతున్నా.. డెలివరీలు మాత్రం మందగించాయని, ఈ ప్రభావం సహజంగానే సేల్స్ అకౌంట్పై కనిపిస్తున్నదని కంపెనీలు చెప్తున్నాయి.