సిటీబ్యూరో, డిసెంబర్ 30: ఆధునిక విద్యా విధానం ద్వారా యువత దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బి.లింబాద్రి కోరారు. గురువారం రాత్రి ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణలో ‘జాతీయ విద్యా వి ధానం అమలు’ అనే అంశంపై జీయర్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్, ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ.లింబాద్రి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 54 డిగ్రీ కళాశాలలు, అనేక కోర్సుల కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు లు చోటు చేసుకున్నాయన్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి వర్చువల్గా మాట్లాడారు. సదస్సులో ప్రొ.జంధ్యాల బీజీ తిలక్, ప్రొ.బీవీఆర్ మోహన్ రెడ్డి, ఏవీ నర్సింగరావు, వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొ.ఎన్వీ రమణారావు పాల్గొన్నారు.