తిరుమల : ‘ శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా ’ అంటూ భక్తులు తిరుమల ( Tirumala ) సన్నిధికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం లభించింది. నిన్న స్వామివారిని 63,738 మంది భక్తులు దర్శించుకోగా 19,746 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.79 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.