పహాడీషరీఫ్, నవంబర్ 20: వదినపై కోపంతో అభం శుభం తెలియని ఆమె కుమారుడిని దారుణంగా హత్య చేశాడు మరిది. పహాడీషరీఫ్ ఎస్సై మధుమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్గృహకల్పలో మహేశ్వరి, వినోద్కుమార్రెడ్డి దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు లక్ష్మీనరసింహ(4) సంతానం. మహేశ్వరి చెల్లెలు లక్ష్మి తన భర్త వీరేశ్తో గొడవపడి ఏడాది నుంచి శ్రీరామకాలనీలోని తన తల్లిగారింట్లో ఉంటున్నది. వదిన తన భార్యను తన వద్దకు పంపడం లేదని వీరేశ్ కోపం పెంచుకున్నాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో రాజీవ్గృహకల్ప నుంచి మహేశ్వరి కుమారుడు లక్ష్మీనరసింహను తీసుకెళ్లాడు. సాయంత్రం జల్పల్లి ఇందిరా సొసైటీ డంపింగ్ యార్డ్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మెడకు వైర్ బిగించి.. పాశవికంగా హత్య చేశాడు. కొడుకు కనిపించకపోవడంతో మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.