వరవరరావుకు బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు వచ్చేనెల 18 వరకు తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆయన.. తన బెయిల్ను పొడించాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు వచ్చేనెలలో వాదనలు వింటామని.. కాబట్టి 18వ తేదీ వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని వరవరరావుకు సూచించింది.