న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.1.16 కోట్లుగా నిర్ణయించింది. ఈ కారును బుకింగ్ చేసుకున్నవారికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. 6.1 సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.