ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: మత విద్వేషాన్ని వ్యాపింపజేయడంలో బీజేపీ ఆరితేరిందని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగిని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. బఘేల్ ఆదివారం యూపీలోని కాన్పూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిజాబ్ వివాదంపై ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టిన వారికి దాని పర్యవసానాలు తెలియవని పేర్కొన్నారు.