వనపర్తి, డిసెంబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఖిల్లాఘణపురం, గోపాల్పేట, శ్రీరంగాపురం ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలకు మంజూరైన అంబులెన్స్లను స్థానిక నా యకులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే సీ ఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. అ నంతరం చెక్కులు అందుకున్న వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. వనపర్తి బాలభవన్ను బాలకేంద్రంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వంతో జీవో విడుదల చేయించినట్లు తెలిపారు. బాలల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి బాలకేంద్రం ముందు వరుసలో ఉంటుందన్నారు. కవులకు, కళలకు, కళాకారులకు పు ట్టినిల్లు వనపర్తి అన్నారు. అలాంటి ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందామని కోరారు. ఎడ్యూకేషన్ హబ్గా పేరొందిన వనపర్తిలో కళలకు మరింత ప్రో త్సాహం అందిస్తామని మంత్రి వివరించారు. ఇచ్చిన మాట ప్రకారంగా బాలకేంద్రాన్ని బాలభవన్గా మారు స్తూ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చామన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మం త్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి నిరంజన్రెడ్డి స్థానికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముం దు బాలకేంద్రంగా అప్గ్రేడ్ చేసినందుకుగానూ బాలభవన్ నిర్వాహకులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అం దజేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్, శ్రీరంగాపురం రైతుబంధు సమితి అ ధ్యక్షుడు నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ మీడియా సెల్ కన్వీనర్ రాజ్కుమార్, నాయకులు పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు.