న్యూఢిల్లీ, డిసెంబర్ 6: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ కారు ‘ఏ4’ సెడాన్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.39.99 లక్షలుగా నిర్ణయించింది. దీంతోపాటు రూ.43.69 లక్షల ధర కలిగిన ఏ4 ప్రీమియం ప్లస్, రూ.47.61 లక్షల విలువైన ఏ4 టెక్నాలజీ మోడళ్ళను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 190 హెచ్పీల శక్తినివ్వనున్నది.