హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దివ్యాంగురాలైన చిత్రకారిణి స్వప్నిక ఆయనకు అపురూప కానుక అందించారు. చేతులు లేకపోయినా నోటితో కేటీఆర్ చిత్రపటాన్ని గీశారు. తనకు కేటీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని ఆమె తెలిపారు. పంజాబ్కు చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మల్లికా హండాకు కేటీఆర్ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన తీరు తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని చెప్పారు.
భవిష్యత్లో మంత్రి కేటీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన ఆమె.. మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన స్వప్నిక తన చిన్నతనంలోనే విద్యుత్తు షాక్తో రెండు చేతులు కోల్పోయింది. అయినప్పటికీ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా నోటితోనే పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై, ఆడపిల్లల సమస్యలపై పెన్సిల్ స్కెచ్ల రూపంలో చిత్రాలు గీస్త్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.